6 వేల మందితో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌

cbn
టెక్నాలజీని వాడుకోవటంలో ఎప్పుడూ ముందుటారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తాజాగా ఆయన రికార్డ్ స్థాయిలోలో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నవ నిర్మాణ దీక్ష మూడో రోజు కార్యక్రమాలకు సంబంధించి మొత్తం 6వేల మందితో ఒకేసారి టెలీకాన్ఫరెన్స్‌ జరిపారు.ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు ప్రతి నియోజకవర్గంలోనూ వెయ్యి మొక్కలు నాటాలని జన్మభూమి కమిటీ సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. అలాగే ఇంటికో ఇంకుడు గుంత, పొలానికో పంటకుంట, ప్రతి వూరికి ఓ వనాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారాయన.