మహాత్ముడికి నివాళి !

Chinese-President-paying-ho
మూడురోజుల పర్యటనలో భాగంగా భారత పర్యటనకు విచ్చేసిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ పలువురు భారత ప్రముఖులతో సమావేశమవుతూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈరోజు ఉదయం జాతిపిత మహాత్మాగాంధీకి చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ఘన నివాళులు అర్పించారు. రాష్ట్రపతి భవన్‌ నుంచి నేరుగా బాపూఘాట్‌ కు చేరుకున్న ఆయన మహాత్ముడి సమాధి దగ్గర పుష్ఫగుచ్ఛం వుంచి నివాళులు అర్పించారు.