విశాఖపట్నం జిల్లా టీడీపీ లో సంక్షోభం నెలకొంది. టీడీపీ క్రియాశీలక సభ్యత్వానికి, పొలిట్ బ్యూరో సభ్యత్వానికి ఆ పార్టీ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెదేపా కార్యకర్తగా మాత్రమే పనిచేస్తానని అన్నారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన చెప్పారు. తనకు అవకాశాలు కల్పించినందుకు ఆయన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పీలా శ్రీనివాస్ను విచారణ చేయకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఆయన తప్పు పట్టాడు