కాంగ్రెస్‌ మహాధర్నా…

Uttam-Kumar-Reddy-appointed స్దానిక సమస్యలను అజెండాగా చేసుకుని తెలంగాణ కాంగ్రెస్‌ జిల్లా స్ధాయిలో ఉధ్యమాలను ప్రారంభించింది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పును వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లాలో ఆందోళనను తీవ్రతరం చేసిన కాంగ్రెస్ నేతలు ఇపుడు మరో కొత్త ఉధ్యమానికి శ్రీకారం చుట్టారు. సుదీర్ఘ కాలంగా ఉన్న వికారాబాద్ ను జిల్లా గా ప్రకటించాలన్న డిమాండ్ తో కాంగ్రెస్‌ నేతలు మహాధర్నా చేపట్టారు. వికారాబాద్ ను జిల్లాగా ప్రకటించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉందన్నారు పిసిసి చీఫ్‌ ఉత్తమ్. పాలనా సౌలభ్యం కోసం స్ధానిక ప్రజలు అడుగుతున్న డిమాండ్ కు ప్రభుత్వం స్పంధించకపోతే భారీ ఉధ్యమం తప్పదని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లాలో 16 లక్షల ఎకరాలతో పాటు హైదరాబాద్ త్రగునీటి కోసం దవంగత నేత వై.యస్ ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్లను టి.ఆర్.ఎస్ ప్రభుత్వం దురుద్దేశ్యంతో డిజైన్ మార్చిందని ఆరోపించారు. శ్రీశైలం నుంచి రంగారెడ్డి జిల్లా ప్రజలకు నీళ్లిస్తామని సర్కార్‌ చెప్పటం హాస్యాస్పధంగా ఉందన్నారు ఉత్తమ్..