జైపూర్ ఏఐసీసీ విస్తృతస్థాయి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ను విడుదల చేసింది. పార్టీ ఈ సమావేశంలో సెక్యులరిజం ఆధారంగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. జైపూర్ డిక్లరేషన్ లో అంశాలు ఈవిధంగా ఉన్నాయి ఉన్నాయి:
- మధ్యతరగతి, యువత లక్ష్యంగా పలు కార్యక్రమాలు
- భావసారూప్య పార్టీలతో కలిసి పోరాడాలని నిర్ణయం
- ఎన్నికల, న్యాయవ్యవస్థల సంస్కరణలకు పార్టీ చూపు
- ప్రభుత్వ పథకాల్లో అవినీతిని అరికట్టేందుకు చర్యలు
- ముసాయిదాలో ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై ప్రస్తావన
- మహిళలపై దాడులకు పాల్పడేవారిపై కఠిన చట్టాలు
- చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
- పోలీస్ రిక్రూట్ మెంట్లో 30 శాతం మహిళలకు అవకాశం
- పార్టీలో అన్ని స్థాయిల్లో 30శాతం మహిళలకు రిజర్వేషన్
- మహిళలకోసం చట్టాలు, పథకాల గురించి జాతీయ స్థాయిలో ప్రచారం
- పంచాయితీ స్థాయిలో పార్టీ యూనిట్ ఏర్పాటు
- పార్టీకి, అనుబంధ సంస్థల మధ్య సమన్వయం
- ఇక నుంచి పార్టీ నేతల వ్యక్తిగత పనితీరుపై విశ్లేషణ
- వచ్చే ఎన్నికల నాటికి పార్టీ పునర్ వ్యవస్థీకరణ
- రాష్ట్ర స్థాయిలో పార్టీకి ఐటీ సేవలు
- పీసీసీ, డీసీసీ అధ్యక్షుల పదవీకాలం 2 నుంచి 3 ఏళ్లకు పరిమితం