ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఢిల్లీ పయనం

DGP-Minni mathewతెలంగాణపై కేంద్రంలో కదలిక మొదలైనట్టు కనిపిస్తుంది. తాజగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్ని మాథ్యూ, డీజీపీ దినేష్ రెడ్డిలు ఈరోజు  (గురువారం) హుటాహుటీన ఢిల్లీ పయనమయ్యారు. ఈ రోజు సాయంత్రం నగరంలో రాష్ర్టపతి పర్యటన ఉన్నప్పటికీ వీరు ఇరువురు ఢిల్లీ వెళ్ళడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రం నుంచి వచ్చిన పిలుపు మేరకు వీరిద్దరూ అత్యవసరంగా ఢిల్లీ బయలుదేరి వెళ్ళినట్లు సమాచారం. ఈనెల 28లోపు ప్రత్యేక తెలంగాణ అంశంపై స్పష్టత ఇస్తామని కేంద్ర హోంమంత్రి షిండే ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఢిల్లీకి పిలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.