కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ ప్రజల మద్య మందు కొట్టి ఆశ్చర్యపరిచాడు..మరి కొద్ది రోజుల్లో జరగబోయే వరంగల్ ఉప ఎన్నికలలో పాల్గొన్న దిగ్విజయ్సింగ్ తనదైన శైలి లో తెరాస ప్రభుత్వం ఫై మండిపడ్డాడు… కేసీఆర్ మాటల గారడి చేసి ప్రజలను మభ్య పెడుతున్నాడని , ఇచ్చిన హామీలను పక్కన పెట్టి తీరుగుతున్నాడని విమర్శించాడు..
అంతే కాక ఈ ఎన్నికలలో కెసిఆర్ కు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని , వరంగల్ లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమంటూ ఎన్నికల ప్రచారం లో ప్రకటన చేసాడు..ఈ సందర్భంగా గౌడకులస్తులు ఈ సందర్భంగా వారి వస్తువులను అందించారు. ఇదే క్రమంలో వేదికపై కల్లు పోయడంతో దిగ్విజయ్ కళ్లు తాగి అందర్ని ఆశ్చర్యపరిచారు. తెలంగాణ ప్రజల సంస్కృతిలో తెల్లకల్లు ఒక భాగమని చెప్పుకొచ్చాడు..