సెప్టెంబర్ 5న ‘డీఎస్సీ’ నోటిఫికేషన్

Gantaఏపీ నిరుద్యోగులకు శుభవార్త. సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు నేడు మంత్రి గంటా శ్రీనివాస్ ఓ ప్రకటన చేశారు. రాష్ట్రంలో 10,603 పోస్టుల భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. ఇక, ప్రభుత్వం పాఠశాల అభివృద్ధికి మరింత ప్రాధాన్యతను ఇస్తున్నామని.. ఇందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలను దత్తత ఇచ్చేందుకు విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులను సంప్రదిస్తున్నామని తెలిపారు. దీనికోసం త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని గంటా పేర్కొన్నారు.