రాహుల్ కు నోటీసులు !

RAHULకాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో.. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో నిర్వహించిన ర్యాలీల్లో పాల్గొన్న రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. భాజాపా ఫిర్యాదును పరిశీలించిన ఈసీ తాజాగా, కాంగ్రెస్ యువరాజు రాహుల్ కు నోటీసులు జారీచేసింది.