సొంత గూటికి మాజీ మంత్రి వినోద్..

కాంగ్రెస్ పార్టీ లో కీలక పదవులు అనుభవించిన మంత్రులు , ఆ తర్వాత తెరాస ప్రభుత్వం ఏర్పడగానే కాంగ్రెస్ పార్టీ ని విడి తెరాస లో చేరారు. ఇప్పుడు తెరాస ప్రభుత్వం టికెట్స్ ఇవ్వకపోయేసరికి మల్లి సొంత గూటికే వెళ్లిపోతున్నారు. ఇప్పటికే పలువురు నాయకులూ చేరగా , తాజాగా ఈరోజు టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వినోద్ సైతం సొంతగూటికి చేరే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తుంది.

ఈరోజు రాహుల్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నట్లు సమాచారం. చెన్నూర్ టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుని.. టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో చోటు దక్కించుకోలేకపోయిన ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. కాంగ్రెస్ తరుపున చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి వినోద్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన.. కాంగ్రెస్ హైకమాండ్ సమక్షంలో తిరిగి పార్టీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. మొత్తానికి టికెట్స్ వస్తే తెరాస లేకపోతే కాంగ్రెస్ అంటూ నాయకులు చేసే పనులు ప్రజల్లో వ్యతిరేకతను తీసుకొస్తున్నాయి.