పవన్ కళ్యాణ్ వల్ల ఓ వ్యక్తి ప్రాణం పోయేది..

farmer-susideఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి , పవన్ కళ్యాణ్ ఇద్దరు తనని మోసం చేసారని ఓ వ్యక్తి విజయవాడలోని సిడబ్ల్యూడి గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన బాబు కటౌట్ పైకి ఆత్మహత్య యత్నం చేసుకోబోయాడు. వివరాల్లోకి వెళ్తే…

గోవిందరాజు అనే వ్యక్తి 2014 వరకు కూడా ఎటువంటి ఎన్నికలకు పోలేదు, కనీసం ప్రచారం కూడా చేయలేదు..అలాంటి వ్యక్తి ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ టిడిపి సపోర్ట్ చేయడంతో.. అతడు కూడా టిడిపి తరపున ప్రచారం చేసి టిడిపికి ఓట్లు వేయించాడు. అయితే, ఎన్నికల సమయంలో గ్రామంలో రోడ్డు వేయిస్తామని, రుణాలు తీరుస్తామని చెప్పారని.. కాని ఇంతవరకు అవి అమలు కాలేదని , దాంతో తనపై ఒత్తిడులు పెరిగాయని.. అందుకే చనిపోవాలని అనుకుంటున్నట్టు గోవిందరాజు సూసైడ్ లేఖలో పేర్కొని కటౌట్ ఎక్కాడు.

తనకు ఇద్దరు సమాధానం చెప్పాలని ఒకటి పవన్ కళ్యాణ్ అయితే రెండోది టిడిపి పార్టీ అని సూసైడ్ నోట్ లో రాసాడు..దీంతో రంగం లోకి దిగిన పోలీసులు మూడు గంటల సేపు సముదాయించి చిట్టచివరకు ఆ వ్యక్తి ని కిందకు దించి అక్కడినుంచి తీసుకొని వెళ్లారు.