తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిన్న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా విమర్శలు సంధించిన సంగతి తెలిసిందే. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు అధికారికంగా నిర్వహించట్లేదో చెప్పాలని, సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహించకుండా మజ్లీస్కు వత్తాసు పలికితే విధంగా కేసిఅర్ తీరు వుందని ఆరోపించారు అమిత్ షా.
అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీశ్రావు. అమిత్షా వ్యాఖ్యలను ఖండించారాయన. ఎవరికో భయపడి విమోచనదినాన్ని జరపలేదనడం హాస్యాస్పదమని అన్నారు. అమిత్షా చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని, కేసీఆర్ ఎవరికీ భయపడరని, కేసీఆర్ మొండి కాబట్టే తెలంగాణ సాధించారని.. ఈ విషయాన్ని అమిత్షా గుర్తించాలని సూచించారు హరీష్. మత సామరస్యతకు మారుపేరు తెలంగాణ అని, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టొద్దని చురకంటించారు హరీష్.