అక్రమాస్తుల కేసుల కేసులో అరెస్టయి చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్న కడప ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు హైకోర్టులో మరోసారి భంగపాటు తప్పలేదు. జగన్ వేసిన బెయిల్ పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఏడు అంశాలపై విచారణ ఉన్నందున ఆ పిటిషన్ విచారణార్హం కాదని తిరస్కరించింది. సీబీఐ వాదనలతో కోర్టు ఏకీభవించింది. దీంతో జగన్ కు బెయిల్ మంజూరు అవుతుందని భావిస్తున్న వైకాపా కార్యకర్తలకు మరోసారి నిరాశే మిగిలింది.