కోర్టుకు హాజరైన జగన్ – విచారణ వాయిదా

ys jagan remanded extensionఅక్రమాస్తుల కేసులో వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఇండియా సిమెంట్స్ కంపెనీ కేసు విచారణ నిమిత్తం జగన్ కోర్టులో హాజరయ్యారు. అయితే, కేసు విచారణను డిసెంబర్ 3వ తేదికి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. కాగా, జగన్ తో పాటుగా, విజయసాయిరెడ్డి, బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ కూడా కోర్టులో హాజరయ్యారు.