తెదేపా ప్రభుత్వంపై ఢిల్లీ వెళ్లి అందరికీ ఫిర్యాదు చేద్దామని హస్తినకు వెళ్లిన ఏపీ ప్రతిపక్షనేత జగన్కు ఎన్సీపీ నేత శరద్పవార్ జలక్ ఇచ్చారు. మీడియాను వెంటేసుకుని శరద్పవార్ ఛాంబర్కు వెళ్లిన జగన్ను ఆయన కసురుకున్నారు. చనువుగా కూర్చిలో కూర్చోవడానికి జగన్ ప్రయత్నించగా ముందు మీతో వచ్చిన ఆ జనం, మీడియా వాళ్లని అవతలకి పంపండి, ఈ గోల అంత ఏంటి నా దగ్గర అని పవార్ అసహనం వ్యక్తం చేశారు.
మధ్యలో ఒంగోలు ఎంపీ ఎస్వీ.సుబ్బారెడ్డి ఒకే నిమిషం సార్ మీకు వినతిపత్రం ఇచ్చి వెళ్లిపోతాం అని ప్రాధేయపడినా పవార్ లెక్కచేయకుండా ముందు మీరు బయటకు వెళ్లండి. కావాలంటే ఒకరిద్దరు మాత్రమే లోనికి రండి అనటంతో మీడియా ఎదుటే జగన్కు జరిగిన పరాభవానికి అందరూ విస్తుపోయారు. “అస్తమాను లోకల్ గొడవలను తీసుకుని వచ్చి నాకు చెబితే నేనేం చేసేది” అని శరద్పవార్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఈ వీడియో కూడా దానిని నిర్థారిస్తోంది.