కాంగ్రెస్ కు షాక్… కాంగ్రెస్ ను వీడనున్నసీనియర్ నేత..

కాంగ్రెస్ పార్టీ లో కీలక పదవులు చేపట్టి, ఆ తర్వాత కాంగ్రెస్ నుండి బహిష్కరించబడిన జలగం ప్రసాదరావు..మొన్నటి వరకు మళ్లీ తనను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుందని ఎదురుచూసాడు. కానీ కాంగ్రెస్ మాత్రం తనను పట్టించుకోకపోయేసరికి తాజాగా అయన తెరాసలో చేరేందుకు నిర్ణయంచుకున్నాడు. ప్రసాదరావుతో స్వయంగా మంత్రి కేటీఆర్‌ భేటీ కావడంతో మరో రెండు మూడు రోజుల్లో భారీ బలగంతో తెరాస పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధం అయ్యాడని తెలుస్తుంది.

గురువారం ఖమ్మం జిల్లాలోని జలగం ప్రసాదరావు రాజకీయ శిబిరంలో సైతం మెరుపు వేగంతో పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రసాదరావు కుప్పెనకుంట్లకు వచ్చినట్లు తన అనుచరులకు సమాచారం ఇవ్వడంతో గురువారం జిల్లాలోని పలు మండలాలకు చెందిన ఆయన అనుచరులు, వివిధ పార్టీల్లో ఉన్న కార్యకర్తలు జలగంతో సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్‌ నేతలు సైతం ఆయనను కలిసేందుకు పోటీపడ్డారు. మొత్తం మీద ప్రసాదరావు తెరాసలో చేరుతుండడంతో పార్టీకి మరింత బలం వచ్చినట్లు కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు.