కమలంలో చేరేందుకు కసరత్తు.. !

Jayaprada
సినీనటి, ఎస్పీ మాజీ నాయకురాలు జయప్రద భాజపాలో చేరేందుకు మక్కువ చూపుతున్నారు. గతంలో.. ఈ విషయాన్ని ఆమె స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా, కమలంలో చేరేందుకు కసరత్తును మరింతగా ముమ్మరం చేసింది. ఈరోజు (శుక్రవారం) భాజపా సీనియర్ నాయకులతో చర్చలు కూడా జరిపింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది. దీంతో.. ఆమె భాజాపా చేరేందుకు రంగం సిద్ధమైట్లు అర్థమవుతోంది. అయితే, తాను పార్టీ వర్కర్‌గా మాత్రమే భాజపాలో చేరాలనుకుంటున్నానని, ఎలాంటి పదవులు ఆశించడం లేదని ఆమె స్పష్టం చేసింది.

గతంలో.. ఆమె రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ పోత్సాహంతో తెదేపా చేరింది జయప్రద. అనంతరం చంద్రబాబు హయంలో.. ఎంపీగా, తెదేపా మహిళా విభాగం అధ్యక్షురాలిగా కీలక భాద్యతలు చేపట్టింది. అటు.. నుంచి యూపీ రాజకీయాల్లో ప్రవేశించిన విషయం తెలిసిందే. కొద్దికాలంగా రాజకీయ స్తంబతగా వుంటోన్న జయప్రద.. తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ కీ రోల్ ప్లే చేయాలని ఆశ పడుతోంది. ఈ నేపథ్యంలో.. అధికార భాజాపా లో చేరేందుకు సిద్ధమైంది. ఆమె భాజాపాను జయప్రదం చేయడంపై మరో ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.