రామ్‌పూర్‌ బరిలో జయప్రద..

దేశ వ్యాప్తంగా ఎన్నికల జోరు నడుస్తుంది..దక్షిణాన బీజీపీ హావ కాస్త తక్కువగానే ఉన్న ఉత్తరాన మాత్రం బీజేపీ హావ బాగా నడుస్తుంది. ఇప్పటికే పలువురు నేతలు బీజీపీ పార్టీ తీర్థం పుచ్చుకోగా..తాజాగా మాజీ ఎంపీ..నటి జయప్రద బీజీపీ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తుంది. గతంలో సమాజ్‌వాదీ పార్టీలో ఉన్న ఆమె.. తర్వాత బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అమర్ సింగ్ శిష్యురాలిగా ఉన్న ఆమె.. ఇప్పటికే రెండుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ రాంపూర్ నియోజకవర్గం నుంచి సమాజ్ వాదీ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు.

కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో రాబోతున్నట్లు తెలుస్తుంది. మార్చి 25వ తేదీ సాయంత్రం లేదా 26వ తేదీ అమిత్ షా సమక్షంలో బీజీపీ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తోన్నాయి. మళ్లీ ఈమెకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని రామ్‌పూర్‌ నియోజక వర్గం టికెట్ ఇవ్వబోతున్నారని అంటున్నారు.