కడియం మంత్ర్రి అయ్యిండు..

kadiyam

సీనియర్ నేత కడియం శ్రీహరిని కేసీఆర్ తన మంత్రి వర్గంలోకి తీసుకొన్న విషయం తెలిసిందే. ఆయనకు మంత్రి పదవితో పాటుగా, డిప్యూటి సీఎం పదవినీ కట్టబెట్టాడు. తాజాగా, కడియం తన శాఖ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. తనకు మంత్రిపదవిని కేటాయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరోసారి కృతజ్ఝతలు తెలియజేశారు.

కడియంతో పాటుగా.. పార్లమెంట్ సెక్రటరీగా వి.సతీష్ కుమార్, తెలంగాణ సాంస్కృతిక సారధి ఛైర్మన్గా రసమయి బాలకిషన్ సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. కాగా, అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా వున్న టి. రాజయ్యను తొలగించి.. ఆ స్థానంలో కడియం ను కేసీఆర్ మంత్రి వర్గంలోకి తీసుకొన్న విషయం తెలిసిందే.