చంద్రబాబు పై నిప్పులు చెరిగిన సినీ నటి కవిత..

Kavitha-Bbauసొంత నాయకుడి పై నిప్పులు చెరిగింది తెలుగు దేశం పార్టీ నాయకురాలు కవిత..నిన్నగచ్చిబౌలి బయో డైవర్సిటీ పార్కులో జరిగిన హరిత హారం కార్యక్రమం లో పాల్గొన్న ఆమె , చంద్రబాబు పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయ్యింది.. అధికారం లో ఉన్నపుడు ఒకలా, అధికారం లేనప్పుడు మరొకలా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు.

ప్రతిపక్షం లో ఉన్నపుడు ఎక్కడ ధర్నా జరిగినా తనకు ఫోన్ చేసేవారని, ఇప్పుడు అధికారం లోకి వచ్చాక పిలవడమే కాదుకదా కలిసినప్పుడు కూడా మాట్లాడడం లేదని వాపోయారు..ఎన్నో ఏళ్లుగా పార్టీ కి సేవలందించిన చంద్రబాబు తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది..ఈమె వ్యాఖ్యలు విన్న కొంతమంది మాత్రం త్వరలోనే టీడీపీ గుడ్ బై చెప్పి తెరాస లో జాయిన్ కాబోతుందని ప్రచారం చేస్తున్నారు…