టీఆర్ఎస్ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దసరాకానుక ఇచ్చారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టి పార్టీ నేతల్లో ఉత్సాహం నింపారు. రాష్ట్రం ఏర్పడి, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఖాళీగా వున్న నామినేటెడ్ పోస్టులని భర్తీ చేయడం ద్వారా దసరాకి రెండు రోజుల ముందే సదరు నేతలకి దసరా బొనాంజా ఇచ్చేశారు సీఎం కేసీఆర్. వివిధ సంస్థలకి కొత్తగా తెలంగాణ ప్రభుత్వం నియమించిన చైర్మన్ల వివరాలిలా వున్నాయి..
ఫౌరసరఫరాల సంస్థ చైర్మన్ – పెద్ది సుదర్శన్ రెడ్డి
టీఎస్ అగ్రోస్ సంస్థ చైర్మన్ – లింగంపల్లి కిషన్ రావు
క్రీడాప్రాధికార సంస్థ చైర్మన్ – ఏ వెంకటేశ్వర్ రెడ్డి
గొర్రెలు, మేకలు అభివృద్ధి సంస్థ – రాజయ్య యాదవ్
టీఎస్ ఐఐసీ సంస్థ చైర్మన్ – జి బాలమల్లు
కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ – మర్రి యాదవ రెడ్డి
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ – మందుల శామ్యూల్
నీటి పారుదల అభివృద్ధి సంస్థ – ఈద శంకర్ రెడ్డి
అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ – బండ నరేందర్ రెడ్డి