పవన్ కళ్యాణ్ కు కెసిఆర్ ఆహ్వానం అందనుందా..?

kcr-pawan-kalyanతెలంగాణా రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ , రాష్ట్రం బాగుండడం కోసం ఆయుత చండీయాగాన్ని నిర్వహించనున్న సంగతి తెల్సిందే..మెదక్ జిల్లాలోని ఎర్రవెల్లి గ్రామంలో ఈ నెల 23 నుండి 27 వరకు పెద్ద ఎత్తున ఈ యాగం జరగనుంది..ఈ చండీయాగానికి దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులతో పాటు, రాష్ట్రపతిని, ప్రధానిని అలాగే ఆధ్యాత్మిక వేత్తలను ఆహ్వానించబోతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి కెసిఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు ని కలిసి ఈ చండియాగానికి రమ్మని ఆహ్వానం పలకున్నారు.

ఇక తెలంగాణా లోని అన్ని రాజకీయ పార్టీలను ఆయుత చండీయాగానికి ఆహ్వానించనున్నారు కెసిఆర్..ఇక పోతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు కూడా కెసిఆర్ ఆహ్వానం పలకునున్నాడని తెరాస శ్రేణులు చెపుతున్నారు…మరో రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్ కి కూడా ఆహ్వాన పత్రిక ఇవ్వనున్నారట..మరి ఎవరు వెళ్లి ఇస్తారు..? పవన్ ఈ యాగానికి వస్తాడా …లేక డుమ్మా కొడతాడా అనేది చూడాలి.