భారీ సభలకు కేసీఆర్ సిద్ధం..

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం కంటి పరీక్షలు, చికిత్స నిమిత్తం ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుండి రాగానే మూడు భారీ బహిరంగ సభల్లో పాల్గొనేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభలలో కేసీఆర్ పాల్గొని కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ప్లాన్ చేసాడు.

నవంబర్ మొదటి వారంలో కరీంనగర్, ఖమ్మం, వరంగల్ సభలు నిర్వహించనున్నారు. అయితే ఆ మూడు సభలకు సంబంధించి టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. నవంబర్ 19 తర్వాత కేసీఆర్ వీలైనన్ని నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేసి రెండోసారి టీఆర్ఎస్‌ను అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నాడు. ఇప్పటికే తెరాస నేతలంతా ప్రచారం లో బిజీ అయ్యారు.