వాళ్ళ ముక్కు నేలకేసి రాయించండి : కేసిఆర్

kcr (14)

సీపీఎం పార్టీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణలో త్వరలో చేపట్టనున్న సీపీఎం ‘మహాజన యాత్ర’పై, ఆ పార్టీ నాయకులపై ధ్వజమెత్తారాయన. “తెలంగాణలో తిరిగే అధికారం సీపీఎం పార్టీ వాళ్లకి ఎక్కడ వుందని ప్రశ్నించిన కేసిఆర్ .. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును చివరి నిమిషం వరకు వ్యతిరేకించిన పార్టీ అదని ఆరోపించారు.

తెలంగాణ ప్రజలకు నేను మనవి చేస్తున్నాను. సీపీఎం పార్టీ వాళ్లను ఎక్కడికక్కడ నిలదీయండి.. క్షమాపణలు చెప్పించి, ముక్కు నేలకేసి రాయించండిని చెప్పారు కేసిఆర్.

దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ పైన కూడా నిప్పులు చెరిగారు కేసిఆర్. కొత్త త్తజిల్లాల ఏర్పాటుపై ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, తెలంగాణ వచ్చుడే ప్రజల దురదృష్టం’’అన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. ఇన్ని జిల్లాలు అవసరమా అనేవారు ఎన్నడైనా చూసిన ముఖాలా.. చేసిన ముఖాలా’ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొత్త మండలాల ఏర్పాటు చేసినప్పుడూ కాంగ్రెస్‌ పార్టీ ఇదే వైఖరిని అవలంభించిందని దుయ్యబట్టారు.