కోమటి రెడ్డి కొడుకిని నాయీంనే చంపేశాడా ?

prateek

నల్గొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ లీడర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కుమారుడు 2011లో జరిగిన కారు యాక్సిడెంట్ లో మృతి చెందిన విషయం తెలిసిందే. అవుట‌ర్ రింగ్ రోడ్డు మీద స్నేహితుల‌తో క‌లిసి వెళ్తున్న కోమ‌టిరెడ్డి కుమారుడి వాహ‌నం అధిక‌వేగంతో బోల్తాప‌డి ఆయ‌న కుమారుడు ప్ర‌తీక్ రెడ్డితో పాటు మరో ఇద్దరు స్నేహితులు కూడా మ‌ర‌ణించారు ఘటన కలచివేసింది. ఇక, ప్రాణంగా పెంచుకొన్న ఏకైక కుమారుడు యాక్షిడెంట్ లో మృతి చెందడంతో కోమట్ రెడ్డి మానసికంగా కృంగిపోయారు. కొన్నాళ్ల పాటు ఇంటికే పరితమైన ఆయన.. తర్వాత మెల్లిగా కోలుకొన్నారు.

అయితే, ఇప్పుడీ ఘటనలో షాకింగ్ న్యూస్ ఒకటి బయటికొచ్చింది. కోమట్ రెడ్డి కుమారుడు యాక్సిడెంట్ లో చనిపోలేదట. ప్లానింగ్ ప్రకారం జరిగిన కుట్ర వల్ల చనిపోయాడట. అదీ కూడా ఇటీవలే పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోయిన గ్యాంగ్ స్టర్ నయీం పక్కా ప్లాన్ తో ప్రతీక్ రెడ్డి చంపేశాడని తేలినట్టు సమాచారమ్. సిట్ దర్యాప్తుల్లో భాగంగా ఓ వ్యాపారి వద్ద రూ. 5కోట్ల వసూలు చేయడ కోసం నయీం చేసిన బెదిరింపు కాల్ రికార్డ్ ఇప్పుడు మీడియాకి చిక్కింది. ఇందులో కోమటి రెడ్డి కొడుకిని తనే ప్లాన్ ప్రకారం చంపానని నయీం చెప్పడం షాకింగ్ కి గురి చేస్తున్నారు.

వీడియో సాక్షం ద్వారా సిట్ అధికారులు ఆ దిశగా దర్యాప్తుని కొనసాగిస్తే మరిన్ని షాకింగ్ విషయాలు బయటపడే అవకాశాలున్నాయంటున్నారు. ప్రస్తుతం నయీం కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే దాదాపు 30 మందికిపైగా ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఏదేమైనా.. కోమటి రెడ్డి కొడుకిని నయీం పక్కా ప్లాన్ తో చంపాడన్న న్యూస్ పెద్ద ట్విస్ట్ గా మారింది.