కేటీఆర్ కి కొత్త జిల్లాల సెగ

ktr (6)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ కు కొత్త జిల్లాల సెగ తగిలింది. కేటీఆర్ ప్రయాణిస్తున్న వాహనాన్ని సిరిసిల్ల జిల్లా సాధన ఐకాస నేతలు అడ్డుకున్నారు.

సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వద్ద ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో, పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. అయితే ఆందోళనకారులు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించడంతో కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది.

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కేసీఆర్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే . క్షేత్రస్థాయిలో ప్రజలకు సుపరిపాలన అందించే ఉద్దేశ్యంలో భాగంగా ప్రస్తుతం ఉన్న పది జిల్లాలకు అదనంగా 14 లేదా 15 జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేయాలని కసరత్తులు చేస్తున్నారు. ఇందులో బాగంగా తమ ప్రాంతాలను కూడా జిల్లాలుగా ప్రకటించాలని చెబుతూ పలు డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.