అమరావతి నిర్మాణానికి కురుమద్దాలి గ్రామ విరాళం

amaravathi-Nirmanamకృష్ణాజిల్లా పామర్రు మండలం కురుమద్దాలి గ్రామ అభివృద్ధి సంఘం రాజధాని అమరావతి నిర్మాణానికి లక్షా 16 వేల రూపాయల విరాళం ప్రకటించింది. సంఘం తరపున గ్రామ సర్పంచ్ శ్రీమతి కొసరాజు స్వప్న గురువారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు చెక్కును అందజేశారు.

అందరికీ భాగస్వామ్యం కల్పించేలా రూపొందించిన ‘మన ఇటుక-మన అమరావతి’ కి ఈ సొమ్ము అందజేస్తున్నామని శ్రీమతి స్వప్న తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలందరి భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని స్పష్టం చేశారు. రాజధానికి విరాళమిచ్చిన కురుమద్దాలి గ్రామస్తులను చంద్రబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి సంఘం అధ్యక్షుడు శ్రీ కొసరాజు సుభాష్ చంద్రబోస్, కార్యదర్శి శ్రీ గుళ్లపల్లి మాధవరావు, ఉపాధ్యక్షులు శ్రీ గుత్తా పట్టాభిరామారావు, శ్రీ గుత్తా సుబ్రహ్మణ్యేశ్వరరావు పాల్గొన్నారు.