మాధవరం పార్టీ మారనున్నారా.. ?

madhavaram
గ్రేటర్ లో తెదేపాకి మరో షాక్ తగిలేలా వుంది. తెదేపా గ్రేటర్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. కారుపై షికారు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే తలసాని శ్రీనివాస రావు, తీగల కృష్ణా రెడ్డి లాంటి సీనియర్లు కారెక్కెశారు. తాజాగా, కూటకట్ పల్లి తెదేపా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా గులాభి గూటికి చేరేందుకు రంగం చేసుకున్నట్లు సమాచారమ్.

బీసీల జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి బీసీల్లో చేర్చితే తాను తెరాసలో చేరుతానని మాధవరం ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈరోజు (గురువారం) ఉదయం మాధవరం తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. బాబుతో భేటీలో మాధవరం బుజ్జగింపబడతాడా.. ? లేదా.. ? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

బాబుతో భేటీకి ముందుకు మాధవరం విలేకరులతో మాట్లాడారు. తొలగించిన బీసీల 26 కులాలను మళ్లీ.. బీసీలో చేర్చితే.. తెరాస తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అని మళ్లీ నొక్కి చెప్పారు. ఈ నేపథ్యంలో.. కృష్ణారావు కారెక్కడం ఖాయమైనే అర్థమవుతోంది. మరికొద్దిసేపట్లో మాధవరం పార్టీ మార్పుపై మరింత స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.