మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత

samaikyndraమినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది. మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమావేశం నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఓయూ జేఏసీ విద్యార్థులతో పాటు, ఈ సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెలంగాణ వాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రుల నివాసాల్లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ జేఏసీ గన్ పార్క్ వద్ద మౌనదీక్ష చేపట్టింది. మరోవైపు సీమాంధ్ర నేతల సమావేశాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ జాగృతి యత్నించటంతో పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని, అక్కడ నుంచి బలవంతంగా తరలిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేలా ఒత్తిడి తెచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు మంత్రుల క్వార్టర్లలోని క్లబ్ హౌస్‌లో నేడు ప్రత్యేక భేటీ నిర్వహిస్తున్నారు.