ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఓ సినిమా రాబోతుంది. చంద్రబాబు పాలన ఇతివృత్తంగా ఓ సినిమా తెరకెక్కిస్తామని విజయవాడ కార్పోరేటర్ కాకమాను మల్లిఖార్జున యాదవ్ చెబుతున్నారు. ఈ చిత్రానికి ఒంగోలుకు చెందిన పసుపులేటి వెంకటరమణ కథ, దర్శకత్వం వహించగా మల్లిఖార్జున యాదవ్ నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ‘చంద్రోదయం’అనే టైటిల్ పెట్టారు. ఆగస్టు 4న ఈ సినిమా ప్రారంభం కానుంది.