కాపుల ఉద్యమానికి మద్దతు తెలుపుతోన్న మెగా స్టార్, మాజీ మంత్రి చిరంజీవి, మాజీ మంత్రి, దర్శక రత్న దాసరి నారాయణరావుపై మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు నిర్వహించిన ఈ ఇద్దరు నేతలు అసలు కాపు వర్గానికి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. కాపుల సంక్షేమాన్ని పట్టించుకోని ఇటువంటి నేతలను దగ్గరకు చేర్చుకోవద్దని ఆ వర్గ ప్రజలకు సూచించారు నారాయణ.
దాసరి నారాయణరావుని జగన్ కొన్ని రోజుల ముందు కలిశారని, ఇప్పుడు ముద్రగడ కూడా కలిశారని, జగన్ చెప్పినట్లే ముద్రగడ పనిచేస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో కాపులు చిరంజీవిని నమ్ముకుంటే వారిని నట్టేట ముంచారని విమర్శించారు. కాపులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కాపులకిచ్చిన హామీలన్నిటినీ తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఈ సందర్భంగా చెప్పుకోచ్చారాయన.