కమలం వైపే ప్రజలు..

దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల లెక్కింపు లో కమలం హావ నడుస్తుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం బీజేపీ 159 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. పంజాబ్ , జమ్మూ కాశ్మీర్ లలో కాంగ్రెస్ హావ చూపిస్తుండగా..మిగతా చోట్ల బీజీపీ ఆధిక్యంలో ఉంది.

కేరళలో కాంగ్రెస్‌ పార్టీ అనూహ్యంగా ప్రారంభ లీడ్స్‌ తీసుకుంది. దాదాపు అన్ని కీలక స్థానాల్లో రాణిస్తోంది. రాహుల్‌ గాంధీ, శశిథరూర్‌తోపాటు ఇతర నేతలు ముందంజలో ఉన్నారు. తెలంగాణాలో మూడు స్థానాల్లో బీజేపీ లీడింగ్ లో ఉండటం విశేషం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనూ బీజేపీ లీడింగ్ లో ఉన్నట్టు కనిపిస్తోంది.