మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్సింగ్ సిద్ధూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి జూన్ 10నే తన రాజీనామాలేఖ ని పంపారు. ఇప్పుడు ఈలేఖ ని ట్విట్ చేశారు సిద్దూ. ఇటీవల చేపట్టిన మంత్రివర్గం విస్తీరణలో సీఎం అమరీందర్ సింగ్ ప్రాదాన్యత లేని శాఖ కట్టబెట్టారని సిద్ధూ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. సిద్ధూ నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖల్లో కీలకమైన స్థానిక సంస్థల శాఖను తొలగిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీంతో సిద్ధూ కేవలం పర్యాటకం, సాంస్కృతిక శాఖకు పరిమితమయ్యారు.
అమరీందర్ నేతృత్వంలో ఇటీవల జరిగిన కాంగ్రెస్ సీఎల్పీ భేటీలోనూ సిద్ధూ పాల్గొనలేదు. తాజా లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఈ ఇద్దరి నేతల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. లోక్సభ ఎన్నికల ఫలితాలపై సమీక్షకు ఉద్దేశించిన ఈ సమావేశంలో సిద్ధూ పనితీరుపై అమరీందర్ ఘాటు విమర్శలు చేశారు.