మరో హీరోయిన్ కు బీజీపీ టికెట్..

సినీ గ్లామర్ ను రాజకీయ పార్టీలు బాగా వాడుకుంటారు.. ముఖ్యంగా ఎన్నికల సమయంలో తమ పార్టీ తరుపున సినీ తారల చేత ప్రచారం చేయించి ఓట్లు కొల్లగొట్టుకోవాలని చూస్తుంటారు. తాజాగా ఈసారి కూడా అన్ని పార్టీ లు ఇలాగే చేస్తున్నాయి. ఇక బీజీపీ పార్టీ విషయానికి వస్తే ప్రచారం మాత్రమే కాదు సినీ తారలకు ఏకంగా టికెట్స్ కూడా ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు నుంచి హీరోయిన్ మాధవీలత బీజేపీ తరపున పోటీ చేస్తుండగా.. కర్ణాటకలో మరో హీరోయిన్ కూడా బీజేపీ తరపున బరిలో దిగేందుకు సిద్ధం అవుతుంది. కర్ణాటకలోని గ్రామీణ ప్రాంత పార్లమెంట్ నియోజక వర్గం నుంచి సిపి యోగేశ్వర్ ను బీజేపీ తరపున పోటీ చేయించాలని చూసింది. ఈసారి పార్లమెంట్ కు పోటీ చేసేందుకు యోగేశ్వర్ సుముఖంగా లేకపోవడంతో.. ఆయన కూతురు హీరోయిన్, మోడల్ నిషా యోగేశ్వర్ ను బరిలోకి దించబోతున్నది బీజేపీ. మరి ఈ రెండు స్థానాల్లో ఈ ఇద్దరు హీరోయిన్లు ఎలాంటి విజయం సాధిస్తారో చూడాలి.