ఒబామా పర్యటన కుదింపు

obama
అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకొన్నాయి. మారిన షెడ్యూల్ ప్రకారం.. తాజ్ మహల్ ను సందర్శకుండానే.. ఒబామా ఫ్యామిలీ తిరిగు ప్రయాణం కానుంది. ఇందుకు సౌదీఅరేబియా రాజు అబ్దుల్లా మరణమే కారణంగా తెలుస్తోంది. నిన్న సౌదీఅరేబియా రాజు అబ్దుల్లా మృతిచెందిన సంగతి తెలిసిందే. ఒబామా భారత పర్యటను కుదించుకొని అబ్దుల్లా అంత్యక్రియలకు హాజరుకానున్నారు.

ఒబామ భారత పర్యటన షెడ్యూల్ ఇదే..
* 25వ తేదీ ఉదయం 10:30గంటలకు ఒబామా భారత్ చేరుకుంటారు.

 

* రాష్ట్రపతి భవన్‌లో లాంఛన స్వాగతం అనంతరం ఒబామా దంపతులు భారత ప్రధాని మోదీతో కలిసి మహాత్మాగాంధీ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారు.

* హైదరాబాద్ హౌస్‌లో మోదీతో, సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమవుతారు

* 26వ తేదీన రాజ్‌పథ్‌లో జరిగే గణతంత్ర వేడుకల్లో విశిష్ట అతిథిగా పాల్గొంటారు.

* 27వ తేదీ దిల్లీలోని సిరి ఫోర్ట్ ఆడిటోరియంలో టౌన్‌హాల్ సమావేశంలో ప్రసంగిస్తారు.

* ముందస్తు ప్రణాళిక ప్రకారం ఒబామా దంపతులు ఆగ్రా పర్యటనకు వెళ్లాల్సి ఉండగా, దానిని రద్దు చేసుకున్నారు.

* అనంతరం 27వ తేదీన భారత పర్యటన ముగించుకొని ఒబామా సౌదీ అరేబియా వెళ్లనున్నారు.