కుమారస్వామి విశ్వాస పరీక్ష రేపటికి వాయిదా…

కర్ణాటక రాజకీయ హైడ్రామా మరింత సస్పెన్స్ థ్రిల్లర్ గా మారింది. విశ్వాస పరీక్షను స్పీకర్‌ సురేష్‌ కుమార్‌ రేపటికి వాయిదా వేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ సభ్యులు సభలోనే బైఠాయించి ఆందోళనకు దిగారు. బలపరీక్షను ఈరోజే నిర్వహించాలని గవర్నర్‌ సందేశాన్ని స్పీకర్‌ పాటించకపోవడం పట్ల బీజేపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

బలపరీక్షను ఈరోజే పూర్తిచేయాలని కర్ణాటక స్పీకర్‌కు రాష్ట్ర గవర్నర్‌ వజూభాయ్‌ వాలా సూచించారు. గవర్నర్‌ సందేశం స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ సభలో చదివి వినిపించారు. ఇదే అంశంపై బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. మరోవైపు విప్‌ విషయంపై సుప్రీం కోర్టు స్పష్టత ఇచ్చేంత వరకూ విశ్వాస పరీక్ష చేపట్టవద్దని సీఎల్పీ నేత సిద్ధరామయ్య లేవనెత్తిన పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌పై సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.