రాజకీయాల్లోకి సుమలత..?

సినీ నటి, కన్నడ రెబెల్‌స్టార్, దివంగత అంబరీశ్‌ భార్య సుమలత రాజకీయాల్లోకి రాబోతోందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. మాండ్య లోక్‌సభ స్థానం సుమలత పోటీ చేయబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. భర్త సొంత నియోజకవర్గం మండ్య నుంచి సుమలత ఎంపీగా పోటీచేయడం ఖాయమైనట్టే అనుకోవాలి. అటు కాంగ్రెస్ పార్టీ సుమలతను ఎంపీగా బరిలోకి దించేందుకు రెడీగా ఉంది.

అంబరీష్ మరణం నేపథ్యంలో సానుభూతి కలిసి వస్తుందనేది కాంగ్రెస్ అంచనా. ఇటు జేడీఎస్ కూడా సుమలత అభ్యర్థిత్వానికి ఓకే చెప్పే అవకాశాలే ఉన్నాయి. చరమాంకంలో కాంగ్రెస్ కు దూరం అయ్యాడు అంబరీష్. జేడీఎస్ కు దగ్గరయ్యాడు ఆయన. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ కాంగ్రెస్-జేడీఎస్ కూటమిగా పోటీచేసే అవకాశం ఉన్న నేపథ్యంలో సుమలత అభ్యర్థిత్వానికి ఇరు పార్టీల మద్దతు ఉన్నట్టే. మరి సుమలత రాజకీయ కెరియర్ ఎలా ఉండబోతుందో చూడాలి.