జగన్ కి పోయేకాలం దగ్గర పడింది

sunitha
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి పరిటాల సునీత. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నవ నిర్మాణ దీక్షను జగన్ నయవంచన దీక్ష అని అభివర్ణించిన సంగతి తెలిసిందే. జగన్ చేసిన ఈ వ్యాఖ్యపై కౌంటర్ ఇచ్చిన సునీత.. జగన్ కు పోయేకాలం దగ్గరకు వచ్చిందని, జగన్ జైలుకు మళ్లీ పోయి రోజు దగ్గరలోనే వుందని, అందుకే అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అంతేకాదు.. ”నువ్వు మాట్లాడిన మాటలు ఎంత దారుణంగా ఉన్నాయి? ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే మాటలా ఇవి? మా నాయకుడు చంద్రబాబు, మేము దరిదాపు పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాము. ఏ రోజైనా, మీ నాయనను ఆ మాటలు అన్నామా?’ అంటూ తనదైన శైలిలో జగన్ పై విరుచుకుపడ్డారు సునీత.