పారికర్ సంచలన వ్యాఖ్యలు !

manohar parikar
రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రక్షణ విషయంలో మాజీ ప్రధానులు రాజీపడ్డారని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు.అయితే, ఆ ప్రధానులెవరనే విషయాన్ని మాత్రం పారికర్ వెల్లడించలేదు. ఓ హిందీ వారపత్రిక ప్రత్యేక సంచిక విడుదల సందర్భంగా.. పారికర్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ వైపు నుంచి భారత్‌ వైపు వచ్చిన ఓ బోటుపై తీర రక్షక దళం చేపట్టిన ఆపరేషన్‌ను ఉద్దేశించి పారికర్ ఈ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

పారికర్ ఏ ప్రధాని అన్న విషయాన్ని స్పష్టం చేయకపోయినా.. దివంగత మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌ను ఉద్దేశించే ఆయన ఆ వ్యాఖ్యలు చేసినట్లు మీడియా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు, పారికర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ వర్గాలు ఖండిస్తున్నాయి. పారికర్ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు. పారికర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ మరోనేత మనీశ్ తివారీ డిమాండ్ చేశారు.

మొత్తానికి.. దేశ రక్షణకు సంబంధించిన లుకలుకలు మరోసారి బహిర్గతం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దేశ రక్షణ విషయంలో అత్యంత జాగ్రత్త వహించల్సిన ప్రధానులు.. నిర్లాక్ష్యాన్ని కూడా వహిస్తారా.. ? అనే సందేహం కలుగుతోంది. మరి.. ముందుముందు మరెన్ని లుకలుకలు బయటికి వస్తాయో వేచి చూడాలి..