జగన్‌ ప్రభుత్వం కూల్చివేతలతో ప్రారంభం అయ్యింది

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. ఏ ప్రభుత్వం అయినా మొదటి కొన్నాళ్ల పాటు ప్రాజెక్ట్‌లు ప్రారంభించడం, పథకాలను ప్రారంభించడం లేదంటే పరిశ్రమలను రప్పించేందుకు ప్రయత్నించడం చేస్తుంది. కాని ఏపీ ప్రభుత్వం మాత్రం కూల్చి వేతలతో మొదలు పెట్టింది. కొత్త ప్రాజెక్ట్‌లను ఆహ్వానించడం మాట అటుంచి ఉన్న పరిశ్రమలకు సరైన వసతులు కల్పించడంలో కూడా ఏపీ ప్రభుత్వం విఫలం అవుతుందని పవన్‌ కళ్యాణ్‌ ఆరోపించాడు.

జగన్‌ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో పరిపాలనను మొదలు పెట్టింది అనేది పవన్‌ కళ్యాణ్‌ ఆరోపణ. ఇంకా పవన్‌ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి రాగానే ఇళ్లను కూల్చేయడం, భవన నిర్మాణ కార్మికులు మరియు ఆశా వర్కర్లను రోడ్డున పడేయడం చేశారు. రాష్ట్రంకు రాజధాని లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ పవన్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అవగాహణ రాహిత్యంతో చేస్తున్న పరిపాలన వల్ల పలు నష్టాలు వాటిల్లుతున్నాయంటూ పవన్‌ ఆరోపించాడు.