బ్రేకింగ్ : ముద్రగడ ను పరామర్శించనున్న పవన్ కళ్యాణ్

Pawan-meet-mudragadaకాపులను బీసీల్లో చేరుస్తామంటూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే..ఈరోజుకు అయిదవ రోజుకు చేరుకోవడం తో ఆయన ఆరోగ్యం కూడా క్షీణిస్తోంది..దీంతో కాపు వర్గీయుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ ముద్రగడ ఆరోగ్య పరిస్థితి పై సమాచారం అడిగి తెలుసుకున్నాడు..2.3. రోజుల్లో పవన్ కల్యాణ్ స్వయంగా ముద్రగడ దగ్గరకు వెళ్లి పరామర్శించనున్నారాని సమాచారం. ఈ రిజర్వేషన్ అరెస్టులు గురించి కేంధ్ర హోంశాఖ తో పవన్ కళ్యాణ్ సంప్రదింపులు జరుపుతున్నాడని వినికిడి.