పవన్ మద్దతు ఎవరికిస్తాడు..? కాపులకా..? ప్రభుత్వానికా…?

Pawan-Warngal-by-pollsకాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన కాపుగర్జన సభ.. ఊహించని రీతిలో ఉద్యమరూపం దాల్చి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిన సంగతి తెలిసిందే…నిన్న కోల్కతా-జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విజయవాడ-విశాఖపట్నం రైల్వే మార్గంలో రైళ్లను ఆపివేశారు. తుని రైల్వే స్టేషన్లో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ లోని నాలుగు బోగిలను, తుని రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆందోళనకారులు నిప్పుపెట్టడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది.

దీంతో జనసేన పార్టీ అధ్యక్షడు పవన్ కళ్యాణ్ ఈ ఘటన ఫై ఈరోజు మద్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు..ప్రస్తుతం కేరళ లో సర్దార్ షూటింగ్ లో ఉన్న ఈయన షూటింగ్ రద్దు చేసుకొని హైదరాబాద్ కు వచ్చాడు…మరి పవన్ ఏం మాట్లాడతాడు..? కాపులకు మద్దతు ఇస్తాడా..? లేక ప్రభుత్వానికి మద్దతు ఇస్తాడా..? అసలే ఏం మాట్లాడతాడు అనేదాని ఫై కాపు వర్గాలే కాదు సామాన్య జనాలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.