అనంత నుంచే మొదలు ఎందుకంటే ?

సినిమాలు ప్రక్కన పెట్టి పూర్తి స్థాయిలో రాజకీయాలపై ఫోకస్ చేశారు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా ఓ నాలుగు రోజుల తెలంగాణలో యాత్ర తర్వాత ఏపీ పర్యటని ప్రారంభించారు. రాయలసీమ జిల్లా అనంపురం నుంచి తన రాజకీయ యాత్రను మొదలెట్టాడు. ఇందులో భాగంగా నేడు కదిరిలో పర్యటిస్తున్నారు.

పవన్ అనంతపురం నుంచే తన రాజకీయ పర్యటనని మొదలెట్టాడు. బాలకృష్ణకు పోటీగానా.. ? అని భావించే వాళ్లు పవన్ స్పష్టత ఇచ్చారు. “తాను ప్రతికూల పరిస్థితుల నుంచి పైకి వచ్చా. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. కష్టాలు ఎక్కడ ఉంటాయో, పరిష్కారం కూడా అక్కడే ఉంటుందని తాను బాలంగా నమ్ముతా. ఇక్కడ కరువు పరిస్థితులు ఉన్నాయి. అక్షరాతస్యత కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అనంతపురాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది” అన్నారు పవన్.