జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా పర్యటన కొనసాగుతోంది. ఈ ఉదయం పవన్ మంత్రి పరటాల సునీత ఇంటికి వెళ్లి సప్రైజ్ ఇచ్చారు. అక్కడ మీడియాతో కూడా ముచ్చటించారు. అక్కడ నుంచి కదిరి పర్యటనకు వెళ్లారు. ప్రస్తుతం కదిరిలో పర్యటిస్తున్నారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. “అభిమానులు తనపై చూపించిన ప్రేమనే రాజకీయాల్లో పెట్టుబడిగా పెట్టి వాళ్లకు మంచి చేస్తా. అన్ని సమస్యలు తీర్చడానికి తన దగ్గర మంత్రదండం లేదని, కానీ మనసులో మంచి చేయాలనే చిత్తశుద్ధి ఉంది. అభిమానులు, అక్కచెల్లెళ్లు తనకు అండగా ఉంటే కేంద్రం మెడలు వచ్చి పనులు చేయిస్తా” అంటూ హామీ ఇచ్చారు.