ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ జెమ్ ద్వారా రికార్డు స్థాయి కొనుగోళ్లు


ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ జెమ్ ద్వారా 2022-23 ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 2లక్షల కోట్ల రూపాయల కొనుగోళ్లు జరపడం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అలోచనలను ప్రతిబింబింపచేస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ముంబైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారనేందుకు ఇది ప్రతీకన్నారు. దేశంలోని మారుమూల ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ శాఖలు అత్యున్నత స్థాయి సమగ్రత, పారదర్శకతతో నిర్వహించాలని మహిళా పారిశ్రామిక వేత్తలు, అంకుర పరిశ్రమలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాన్ని మరింత బలోపేతం చేయాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు.