పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ న్యూ మిషన్ స్టార్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తొ ఒప్పందం చేసుకున్న పీకే టీం తన కార్యచరణ ప్రారంభించింది. రాజకీయాల్లో యువత పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. యువతలో రాజకీయ చైతన్యం పెంచే క్రమంలో ప్రత్యేక శిక్షణా తరగతులు ఏర్పాటు చేసే దిశగా ముందు సాగుతోంది. ఇప్పటికే రోజుకు దాదాపు ఐదు వేల మంది ఈ కార్యక్రమంలో తమ పేరు నమోదు చేసుకుంటున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురైన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని దీటుగా ఎదుర్కొనేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. సెప్టెంబరు నాటికి 5 లక్షల సభ్యత్వాలే లక్ష్యంగా పీకే టీం ప్రణాళికలు రచిస్తోంది. తమ టార్గెట్ పూర్తైన తర్వాత 15 నెలల పాటు శిక్షణా తరగతులు నిర్వహించనుంది. లోక్సభ ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించిన బీజేపీకి… 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కళ్లెం వేయాలని భావిస్తోంది. ఇక బెంగాల్లో మొత్తం 40 లోక్సభ స్థానాలుండగా.. టీఎంసీ 22 స్థానాల్లో విజయం సాధిస్తే.. బీజేపీ దీదీకి గట్టి పోటీ ఇస్తూ.. ఏకంగా 18 స్థానాల్లో విక్టరీ కొట్టింది.