ఎమ్మెల్యే బోండా ఉమా భార్యపై పోలీస్ కేసు

విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా భార్య సుజాతపై పోలీసు కేసు నమోదైంది. స్వాతంత్ర్య సమరయోధుల భూమిని తప్పుడు పత్రాలతో ఎమ్మెల్యే అనుచరులు తనఖా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితులు సీఐడిని ఆశ్రయించారు. సీఐడీ దర్యాప్తులో సుజాతతో పాటు మరో 8 మంది దోషులుగా తేలినట్టు తెలుస్తోంది.

గతంలోనూ ఎమ్మెల్యే బోండా ఉమా భార్య సుజాత పై భూ ఆక్రమణ ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా స్వాతంత్ర్య సమరయోధుల భూమి ఆక్రమణ విషయంలోనూ ఆమె పేరు తెరపైకి వచ్చింది. మరీ… ఈ కేసు ఏ మలుపు తిరుగుతుంది ? ఇందులో ఎమ్మెల్యే బోండా పాత్ర ఏమైనా ఉందా ? అనేది తెలియాల్సి ఉంది. ఈ ఏపీసోడ్ లో ప్రతిపక్షాలు టీడీపీని టార్గెట్ చేసే ఛాన్స్ కనబడుతోంది.