సుష్మా స్వరాజ్ కాళ్ళు పట్టుకున్న పొన్నం.. నిజమే

ponnam
విభజన బిల్లు సమయంలో కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ బీజేపీ నేత సుష్మా స్వరాజ్ కాళ్లు పట్టుకున్నాడని కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి తన పుస్తకంలో రాసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ విషయాన్ని కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ ఒప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం విభజన బిల్లు సమయంలో తాను బీజేపీ నేత సుష్మా స్వరాజ్ కాళ్లు పట్టుకున్న విషయం నిజమేనని ప్రభాకర్ చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే తాను సుష్మా స్వరాజ్ కాళ్లు పట్టుకోవాల్సి వచ్చిందని.. ఆమె తమ పార్టీ నేత కాదు కాబట్టి ఆ విధంగా బతిమిలాడుకోవాల్సి వచ్చిందని చెప్పారు పొన్నం. విభజన బిల్లుకు తాము మద్దతు ఇచ్చిన తర్వాత హెడ్ కౌంట్ అవసరం లేదని నాడు సుష్మాస్వరాజ్ చెప్పారని , పార్లమెంట్ లో విభజన బిల్లు పాస్ అయినపుడు ప్రత్యక్ష సాక్షిగా తాను అక్కడ వున్నానని వెల్లడించారు పొన్నం.