‘వీహెచ్’ ని..నీయమ్మా…అన్న పోసాని.

posani-vh-live-fightపోసాని కృష్ణ మురళి..ఇతడు ఎంతో గొప్ప రైటర్ , నటుడో అందరికి తెల్సిందే..అంతే కాదు ఇతడిని మెంటల్ కృష్ణ అని ముద్దుగా పిలుస్తారు. ఎవరి మీద అయినా నిర్మొహమాటంగా మాట్లాడడంలో పోసాని ముందుంటాడు..పక్కన ఎవరున్నా , ఏ స్థాయిలో ఉన్న తనకు తోచింది మాట్లాడాడే వ్యక్తిత్వం కలవాడు..తాజాగా ఓ టీవీ లైవ్ లో ‘వీహెచ్’ ని..నీయమ్మా అని అనడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది..వివరాల్లోకి వెళ్తే..

తాజాగా ఓ ఛానల్ నిర్వహించిన డిబేట్ లో పోసాని పాలుపంచుకున్నారు. ఇండియాపై పాకిస్తాన్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి చర్చ జరుగుతుండగా.., భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికేత్తేస్తూ పోసాని కీలక వ్యాఖ్యలు చేసారు. పాకిస్తాన్ వెళ్లి నవాజ్ షరీఫ్ అమ్మకు చీర పెట్టి, కాళ్ళకు దండం పెట్టిన మోడీ, మన దేశ రక్షణ కోసం ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఎందుకు విభేదిస్తారని, ఎంతసేపు మన సైనికులే చనిపోవాలా? అంటూ మాట్లాడాడు..ఈ నేపథ్యం లో కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు కల్పించుకుని పోసాని వ్యాఖ్యలతో తీవ్రంగా విభేదించారు.

దీంతో పోసాని ప్రత్యర్ధి నాయకులపై సెటైర్లు వేసారు. ‘మీరు మాట్లాడినపుడు నేను మాట్లాడలేదు, అలా మాట్లాడడానికి నేనేమి పిచ్చి కుక్క కాదు, నేను చదువుకున్న వాడ్ని, ఎస్… నాకు మోడీ అంటే ఇష్టం… నా ఇష్టాన్ని కాదనే హక్కు ఎవడికీ లేదు..అంటూ ఊగిపోయాడు..ఈ లోపు మళ్లీ వీహెచ్ కల్పించుకోవడంతో, పోసాని తన కోపాన్ని ఆపుకోలేక నీయమ్మా… అంటూ తిట్టడం మొదలు పెట్టాడు..కాగా పరిస్థితి చేయిజారడం తో ‘లైవ్’ను కట్ చేసింది ఆ టీవీ యాజమాన్యం..

దీంతో ఇప్పుడు పోసాని – హనుమంతరావు ల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇది ఇక్కడితోనే వదిలిపోద్దా..లేక ఇంకా గొడవ పెద్దవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.