తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ మొదటి వారంలో ముందస్తు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని పార్టీలు తమ ప్రచారంలో బిజీ అయ్యారు. ఇక ప్రముఖ సినీ నటుడు , దర్శకుడు పోసాని కృష్ణ మురళి తన ఓటు గురించి పబ్లిక్ గా తెలియజేసాడు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్.. ఈరోజు ఉదయం పోసాని కృష్ణ మురళి ఇంటికి వెళ్లి మద్దతు కోరారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో తక్కువ వ్యవధిలోనే సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. సీఎం కేసీఆర్ ఉత్తమమైన పాలన అందిస్తున్నారు. అందుకే నా ఓటు టీఆర్ఎస్కే వేస్తానని తెలియజేసాడు. ఈ సందర్భాంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫై ఓ రేంజ్ లో నిప్పులు చెరిగారు.